‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాలలో జంటగా నటించి అలరించారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి. కాగా, ఈ ఇద్దరు ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం వరణ్ `బాక్సర్` (పరిశీలనలో ఉన్న పేరు) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో వరుణ్ బాక్సర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్గా ఇప్పటికే బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ ఎంపికవగా… మరో నాయికగా లావణ్య త్రిపాఠి సెలెక్ట్ అయిందని టాలీవుడ్ టాక్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే ఈ పాత్ర పరిధి తక్కువే అయినా… సినిమాలో మంచి ఇంపాక్ట్ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే లావణ్య ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: