సినీ కార్మికుల కోసం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి ఆర్ధిక సాయం అందించిన సంగతి తెలిసిందే. ఎక్కడి సినిమాలు అక్కడ వాయిదా పడటం… షూటింగ్ లు ఆగిపోవడంతో నిత్యావసరాలకి వాళ్ళకి చాలా కష్టమవుతుంది. ఇప్పటికే పలువురు అగ్రనటులు సినీ కార్మికుల కోసం భారీ ఎత్తున విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ సినీ కార్మికుల సంక్షేమానికి ముందుకువచ్చారు. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) పేరిట ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సీసీసీ చైర్మన్ గా చిరంజీవి వ్యవహరించనుండగా, కమిటీ సభ్యులుగా డి.సురేశ్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్ వ్యవహరిస్తారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కార్మికుల కోసం విరాళాలు ఇచ్చే నటీనటులంతా సీసీసీని సంప్రదించాలని చిరంజీవి సూచించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
To aid the Film workers especially the daily wage earners who need most support in the industry at this time, we have set up #CoronaCrisisCharity (CCC).
Responding to our appeal a total sum of 3.8 Cr has been pooled so far including @tarak9999 25 lacs@iamnagarjuna 1 Cr. ..1/2— Chiranjeevi Konidela (@KChiruTweets) March 28, 2020
ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న కలకలాన్ని మనమంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా చూస్తున్నాం. ఈ సమయంలో సినీ పరిశ్రమకు చెందిన శ్రామికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎలాంటి విపత్తులు సంభవించినా తామున్నామంటూ ఇండస్ట్రీ వర్గాలు ముందుకొస్తుంటాయి. మన సోదర కార్మికుల కోసం తానున్నానని ముందుగా చిరంజీవి ముందుకొచ్చారు. ఆయన ఆధ్వర్యంలో నేను, సురేష్బాబు, ఎన్,శంకర్, దామోదరప్రసాద్ కలిసి ఓ కమిటీగా ఏర్పాటై సీసీసీ సంస్థ ద్వారా కార్మికుల సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. దీనికి ఎన్టీఆర్ 25, మహేష్ 25 లక్షలు ప్రకటించారు` అని తెలిపారు.
ఇక ఇదిలా ఉండగా… కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నారు. స్టార్ ఆంధ్ర, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్ కు కూడా హీరోలు తమ వంతు సాయంగా ఆర్ధిక మద్దతు ప్రకటిస్తూ విరాళాలు అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: