అన్నదమ్ముల సెంటిమెంట్తో తెలుగునాట పలు చిత్రాలు సందడి చేశాయి. వాటిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ‘రంగస్థలం’ ఒకటి. ఇందులోని “చిట్టిబాబు” పాత్రలో చరణ్ అభినయించిన తీరు విమర్శకులను సైతం కట్టిపడేసింది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ 80లనాటి పిరియాడిక్ యాక్షన్ డ్రామాలో సమంత కథానాయికగా నటించింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నరేష్, అనసూయ భరద్వాజ్, రోహిణి, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించగా… స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో నర్తించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చంద్రబోస్ గీత రచన చేయగా… టాలీవుడ్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో రూపొందిన గీతాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. “ఎంత సక్కగున్నావే”, “రంగమ్మ మంగమ్మ”, “ఆ గట్టునుంటావా”,” జిగేలు రాణి”, “రంగ రంగ రంగస్థలాన”, “ఓరయ్యో”… ఇలా ప్రతీ పాట జనాదరణ పొందింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి `బెస్ట్ ఆడియోగ్రాఫర్` (యం.ఆర్.రాజకృష్ణన్) విభాగంలో నేషనల్ అవార్డు దక్కింది. దీంతో పాటు పలు ప్రాంతీయ పురస్కారాలను కూడా సొంతం చేసుకుందీ సినిమా. 2018 మార్చి 30న విడుదలై రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రంగా నిలచిన మ్యూజికల్ సెన్సేషన్ ‘రంగస్థలం’… నేటితో రెండేళ్ళను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: