చాలా గ్యాప్ తర్వాత భీష్మ సినిమాతో మంచి హిట్ కొట్టాడు నితిన్. నితిన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా భీష్మ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన నితిన్ ఖాతాలో పలు సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నాగవంశీ సితార బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘అంధాదున్’ రీమేక్ లో కూడా నితిన్ నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా రీమేక్ తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించారు కూడా. సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ జూన్ నుండి మొదలుకానుంది.
ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో కూడా నితిన్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకి ‘పవర్ పేట’ అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు. ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. 1960 నుంచి 2020 వరకూ జరిగే కథ అట ఇది. ఈ నేపథ్యంలో ఒక్కో దశలో ఒక్కో లుక్ తో నితిన్ కనిపించనున్నాడట. 18 ఏళ్ల యువకుడిగా .. 40 ఏళ్ల వ్యక్తిగా .. 60 ఏళ్ల వృద్ధుడిగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: