‘కరోనా’ నివారణకు విరాళాలు.. ముందుకొస్తున్న టాలీవుడ్ ప్రముఖులు…

Tollywood Film Celebrities Donates Money To Government To Curb Corona Virus Spread In Both Telugu States

రోజు రోజు కి కరోనా భయం ప్రజల్లో పెరుగుతుంది. ఇక భారత్లో 630 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీని నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. క‌రోనాని త‌రిమికొట్టేందుకు కొన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారు. దీనిని భాగంగానే కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఇక క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ప్ర‌భుత్వంకి త‌మ వంతు సాయం అందించేందుకు ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ముందుకొస్తున్నారు. వీరి కృషిని అభినందిస్తూ చాలా మంది సెలబ్రిటీలు ఆర్ధికంగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. రజినీకాంత్, నితిన్ లాంటి స్టార్లు ఇప్పటికే విరాళాలు ప్రకటించి తమ మంచి మనసు చాటుకోగా..ఇప్పుడు మరికొంతమంది విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు, ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందులో ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. కోటి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో దేశానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పవన్ ఈ సందర్భంగా వెల్లడించారు.


తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తనవంతుగా సాయం చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పవన్ కళ్యాన్ … ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రూ. కోటి సాయం అందించిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ గారిని ఆదర్శంగా తీసుకుంటూ… తనవంతుగా తెలుగు రాష్ట్రాల కోసం పోరాడుతున్న ప్రభుత్వాలకు రూ.70 లక్షలు ఇస్తున్నట్లు తెలిపాడు. దేశ క్షేమం కోసం నిరంతం శ్రమిస్తున్న ప్రధాని మోదీపై ఈ సందర్భంగా రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషి కూడా చెర్రీ కొనియాడారు.


ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సహాయ నిధికి రూ. 5ల‌క్ష‌లు, తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 5ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. సామాజిక దూరం ప్ర‌తి ఒక్క‌రు పాటించాల‌ని, క‌రోనా నివార‌ణ‌లో భాగంగా ప్ర‌భుత్వం చేప‌ట్టిన లాక్ డౌన్‌ని ప్ర‌తి ఒక్క‌రు సక్సెస్ చేయాల‌ని అనీల్ స్ప‌ష్టం చేశాడు.


స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ. 20 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయనిధులకు రూ.పది లక్షల చొప్పున విరాళం అందించారు.

షూటింగ్స్ నిలిచిపోవ‌డంతో పేద క‌ళాకారులు, టెక్నీషియ‌న్స్ ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాంటివారికి సాయం చేసేందుకు డైరెక్టర్ వి.వి. వినాయ‌క్ త‌న వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చారు. న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్‌కుమార్ ఆధ్వర్యంలో న‌డుస్తోన్న ‘మ‌నం సైతం’ ఫౌండేష‌న్‌కు రూ. 5 ల‌క్షలు అంద‌జేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =