సామజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్ లో ఉండాలని మెగా స్టార్ చిరంజీవి నిర్ణయించుకున్నారు. ఉగాది పండగ సందర్భం గా చిరంజీవి ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఉగాది శుభాకాంక్షలు తెలిపి, కరోనా మహమ్మారి పై పోరాడటానికి అందరం భాగస్థులం అవుదామని
చిరంజీవి ఫస్ట్ ట్వీట్ చేశారు. ఇప్పుడే “RRR” మూవీ మోషన్ పోస్టర్ చూశానని, కనువిందుగా ఉందని, దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లను అభినందిస్తూ చిరంజీవి మరో ట్వీట్ చేశారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఉగాది రోజు సాయంత్రం హోమ్ టైమ్ , మామ్ టైమ్ అంటూ తన మదర్ తో ఉన్న ఫోటో ను చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ కి అభిమానులు హర్షాతిరేకం వ్యక్తపరిచారు. ప్రస్తుతం చిరంజీవి ఫాలోవర్స్ సంఖ్య నిమిష నిమిషానికి పెరుగుతుందని సమాచారం. వెల్ కమ్ టు ట్విట్టర్ సార్ అంటూ చిరంజీవి కి స్వాగతం పలుకుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. కొంతమంది సినీ ప్రముఖులు చిరంజీవి కి స్వాగతం పలికారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: