కరోనా వైరస్ కార్చిచ్చులా వ్యాపిస్తూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కరోనా వైరస్ భారీ ధన, ప్రాణ నష్ఠాలను కలుగజేస్తుంది. చిత్ర పరిశ్రమ నే కాకుండా పలు వాణిజ్య సంస్థలకు కూడా భారీగా నష్టం కలిగేలా చేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామజిక దూరం పాటించాలని మహేష్ బాబు ప్రజలను కోరారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇది కష్టకాలం అని, ప్రజారోగ్యం దృష్ట్యా మనం సామజిక జీవితాన్ని త్యాగం చేయాల్సిన సమయం అని, రద్దీ గా ఉండే ప్రాంతాలలో గుంపులుగా ఉండే ప్రజలపై కరోనా తన ప్రభావాన్ని చూపిస్తుందని , కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు బయటకు వెళ్ళకుండా తమఇంట్లో నే ఉండాలని మహేష్ బాబు ట్వీట్ చేశారు. కరోనా వైరస్ నివారణ కై ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఆరు సూత్రాలను పాటించాలని హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సందేశం ఇచ్చారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రతీ ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని ప్రభాస్ పిలుపునిచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: