జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “ప్రస్థానం” మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్, నివేత పేతురాజ్ జంటగా రూపొందనున్న సోషల్ డ్రామా ప్రొడక్షన్ నెం 1 మూవీ ఈ రోజు ప్రారంభం అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నిర్మాత BVSN ప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపల్లి పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ దేవుడి ఫోటో పై క్లాప్ తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




చిత్ర విశేషాలను హీరో సాయి తేజ్ ట్విట్టర్ ద్వారా ఆనందం తో వెల్లడించారు. ఈ సమయం లో మాటలు దొరకడం లేదని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మామ ఈ మూవీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా పాల్గొన్నందుకు థ్యాంక్స్ అని, మీ ప్రేమ, అభిమానం, దీవెనలు కావాలని సాయి ట్వీట్ చేశారు. సాయితేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న “సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ మే 1వ తేదీ సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























