అందం, అభినయం మేలికలయికగా గుర్తింపు తెచ్చుకుంది లావణ్య త్రిపాఠి. `అందాల రాక్షసి` (2012)తో నాయికగా తొలి అడుగేసిన లావణ్య.. అనతికాలంలోనే నటిగా తనదైన ముద్రవేసింది. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలతో అలరించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. మధ్యలో కాస్త ట్రాక్ తప్పినట్లు అనిపించినా.. గత ఏడాది చివరలో విడుదలైన `అర్జున్ సురవరం`తో మళ్ళీ విజయాన్ని అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన `ఏవన్ ఎక్స్ ప్రెస్` మూవీలో నటిస్తున్న లావణ్యకి.. తాజాగా తమిళ చిత్ర సీమ నుంచి ఓ ఆసక్తికరమైన పాత్ర వరించిందట. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దగ్గర శిష్యరికం చేసిన రవీంద్ర మాధవ అనే యువ దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రంలో కలెక్టర్ పాత్రలో కనిపించనుందట లావణ్య. అభినయానికి అవకాశమున్న పాత్ర ఇదని.. `గద్దలకొండ గణేష్` ఫేమ్ అధర్వ మురళి హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. లావణ్య కెరీర్ లో మరో మెమరబుల్ ఫిల్మ్ అవుతుందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది.
కాగా, ఇదివరకు `బ్రమ్మన్` (2014), మాయవన్ (2017) అనే తమిళ చిత్రాల్లో నటించింది లావణ్య. మరి.. కొత్త చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: