కృష్ణ వారసుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకొని సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు మహేష్. అంతేకాదు ఈ హీరోకు కేవలం తెలుగులోనే కాదు అటు కోలీవుడ్, శాండిల్వుడ్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఇక ఇదిలా ఉండగా మహేష్ బాబు బాలీవుడ్ లో సినిమాలు చేయనని ఇప్పటికే చాలా ఇంటర్వూస్ లో చెప్పిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు చెప్పినా… బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తూనేవున్నాయి.. అయితే అవన్నీ వట్టి రూమర్లే అంటూ ఎప్పటికప్పుడు మహేష్ బాబు కూడా కొట్టి పడేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ తెరపైకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా మహేష్ బాబు రణవీర్ సింగ్తో పాటు ఓ అడ్వర్టైజ్మెంట్ లో పాల్గొన్నారు. గత రెండేళ్లలో ఇలా వారిద్దరూ నటించడం మూడోసారి. అయితే అక్కడ బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ నాడియాద్వాలా మహేష్ ను కలవడం జరిగిందట. మహేష్బాబుతోపాటు రణ్వీర్ సింగ్ మల్టీ స్టారర్ సినిమాను ప్యాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలని నిర్మాత సాజిద్ నడియావాలా చూస్తున్నాడట. ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించనున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే మాత్రం మహేష్ ఒప్పుకోవాలి. మహేష్ ఒప్పుకోవడం ఒక రకంగా కష్టమైన పనే మరి చూద్దాం ఫ్యూచర్ లో అయినా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: