యంగ్ టైగర్ యన్టీఆర్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్… మరోసారి జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. `అరవింద సమేత` తరువాత ఈ ఇరువురి కలయికలో వస్తున్న సదరు కొత్త చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2021 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఇందులో మరో కథానాయికకు కూడా స్థానముందట. కాకపోతే, ఫుల్ లెన్త్ రోల్ గా కాకుండా కథను మలుపు తిప్పే కీ-రోల్ అట. ఆ పాత్రలో టాలెంటెడ్ బ్యూటీ సమంత నటిస్తుందని వినికిడి. అదేగనుక నిజమైతే… `బృందావనం`, `రామయ్యా వస్తావయ్యా`, `రభస`, `జనతా గ్యారేజ్` తరువాత తారక్ తో… `అత్తారింటికి దారేది`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `అ ఆ` తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ సామ్ నటించే సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే సామ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: