కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా ఈ సినిమా తెలుగు టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగులో ఈ సినిమాకు ‘జగమే తంత్రం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#JagameTantram New Poster.
▶️ https://t.co/p3Ea1FW0G2@dhanushkraja @karthiksubbaraj @sash041075 @Music_Santhosh @chakdyn @RelianceEnt @Shibasishsarkar @APIfilms @GA2Official @StudiosYNot pic.twitter.com/U7RgMgyi12
— UV Creations (@UV_Creations) February 20, 2020
[custom_ad]
వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా… యశ్వంత్ అశోక్ కుమార్, జోజు జార్జ్, జేమ్స్ కాస్మో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను ను గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.
దీనితో పాటు మరో సినిమాను సెల్వరాజ్ డైరెక్షన్లో చేస్తున్నాడు ధనుష్. ఈ చిత్రానికి కర్ణన్ అనే పేరు పెట్టారు. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాలీవుడ్ నటి రజిష విజయన్ హీరోయిన్ గా నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: