`ఉప్పెన`… మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు, `సుప్రీమ్` హీరో సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తొలి చిత్రం. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… ఏప్రిల్ 2న థియేటర్లలో సందడి చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆసక్తికరమైన విషయమేమిటంటే… సరిగ్గా పుష్కరకాలం క్రితం అంటే 2008లో ఇదే తేదిన పవన్ కళ్యాణ్ నటించిన `జల్సా` చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు.. `ఖుషి` తరువాత సరైన హిట్ లేని పవన్ కి కమర్షియల్ గా మరో బ్లాక్ బస్టర్ ని అందించింది. మరి.. మేనమామ లక్కీ డేట్ కి వస్తున్న మేనల్లుడి చిత్రం కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
[custom_ad]
కొసమెరుపు ఏమిటంటే.. మ్యూజికల్ సెన్సేషన్ గా నిలచిన `జల్సా`కి బాణీలు అందించిన దేవిశ్రీ ప్రసాద్ నే… ఇప్పుడు `ఉప్పెన`కి కూడా స్వరాలు సమకూర్చుతున్నాడు. మొత్తంగా… ఏప్రిల్ 2, దేవిశ్రీ ప్రసాద్.. ఇలా ఈ రెండు అంశాలు `ఉప్పెన`కి అచ్చొచ్చే అంశాలే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: