ఈ వయసులో కూడాయంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్బార్ తో హిట్ కొట్టిన రజినీ అదే జోష్ తో అప్పుడే మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు. శివ డైరెక్షన్లో రజినీ తన కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అంతేకాదు ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ముగిసినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సిద్దార్థ్ ఎంపికయ్యాడు. త్వరలో మొదలుకానున్న రెండో షెడ్యూల్లో ఆయన జాయిన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.
కాగా తమిళ హీరో సిద్దార్థ్ సోలో హీరోగా సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్, శంకర్ చేస్తున్న ‘ఇండియన్ 2’ చిత్రంలోకూడా ఒక కీలక పాత్ర చేస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: