అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు “. ఈ నెల 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. ఇక ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో నిన్ననే హన్మకొండలో సెలెబ్రేషన్స్ కూడా జరిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇక తాజాగా తన ముద్దుల కూతురితో కూడా సక్సెస్ మీట్ లో పాల్గొన్నాడు. సితారాతో మహేష్ సక్సెస్ మీట్ ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే… మహేశ్ బాబు ముద్దుల తనయ సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య కలిసి ‘ఏ అండ్ ఎస్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. వారానికో వీడియోతో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా హీరోయిన్ రష్మిక మందన్నను ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇక తాజాగా మహేశ్ బాబును కూడా తమ ఛానెల్కు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి సూపర్స్టార్ అభిమానుల మనసు దోచుకున్నారు. తన తండ్రిని తానే ఇంటర్వ్యూ చేసి అభిమానులకు భలే సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సితార, ఆద్య అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ బాబు సమాధానమిచ్చారు. మరి ఆ ఇంటర్వ్యూను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..
[custom_ad]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: