వరుస విజయాలతో ముందుకు సాగుతున్న కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. రీసెంట్ గా రిలీజైన `అల వైకుంఠపురములో`తో మరో బ్లాక్ బస్టర్ ని తన సొంతం చేసుకుందీ స్టన్నింగ్ బ్యూటీ. ఇదిలా ఉంటే.. పూజ టాలీవుడ్ కెరీర్ ని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టమవుతోంది. అదేమిటంటే… 2017 నుంచి ఏడాదికో మెగా కాంపౌండ్ హీరోతో జట్టుకట్టడమే కాకుండా.. విజయాలను ఒడిసిపట్టుకుంటోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే.. 2017లో అల్లు అర్జున్ `దువ్వాడ జగన్నాథమ్`తో తొలి సక్సెస్ చూసిన పూజ.. 2018లో రామ్ చరణ్ `రంగస్థలం`లో జిగేల్ రాణిగా ప్రత్యేక గీతంలో కనువిందు చేసి ఫస్ట్ బ్లాక్ బస్టర్ చూసింది. ఇక 2019లో వరుణ్ తేజ్ సరసన `గద్దలకొండ గణేష్`లో మెరిసి మరో విజయాన్ని వశం చేసుకుంది. కట్ చేస్తే… ఈ సంవత్సరం ఆరంభంలో బన్నీతోనే `అల వైకుంఠపురములో` రూపంలో సెన్సేషనల్ హిట్ అందుకుంది. మరి.. రానున్న కాలంలోనూ పూజ ఈ `మెగా` పరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: