`అల వైకుంఠపురములో`తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఒకవైపు ఈ సినిమా సక్సెస్ ని ఆస్వాదిస్తూనే… మరోవైపు నెక్స్ట్ ఫిల్మ్ షూటింగ్ కి సిద్ధమవుతున్నాడు బన్నీ. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఈ అల్లు స్టార్… ఇదివరకెన్నడూ కనిపించని పాత్రలో దర్శనమివ్వనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే… బన్నీ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తిచేసిన సుక్కు… సెకండ్ షెడ్యూల్ ని ఫిబ్రవరి తొలి వారం నుండి ప్లాన్ చేస్తున్నాడు. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ కూడా పాల్గొననున్నాడు. తాజాగా, ఈ విషయాన్ని సుక్కు స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు.. తొలి షెడ్యూల్ లో తెరకెక్కించిన సన్నివేశాలన్నీ చాలా బాగా వచ్చాయని తెలిపాడు. మరి… `ఆర్య`, `ఆర్య 2` చిత్రాల తరువాత బన్నీ, సుక్కు కాంబినేషన్ లో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వారి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.
రశ్మిక నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: