తెలుగునాట సంక్రాంతి సీజన్.. పలువురి ప్రముఖుల రీ-ఎంట్రీకి వేదికగా నిలుస్తోంది. మరీ ముఖ్యంగా.. తెలుగు చిత్ర పరిశ్రమని శాసించిన ఇద్దరు అగ్రశ్రేణి నటులు మూడేళ్ళ గ్యాప్ లో సిల్వర్ స్క్రీన్ పై సుదీర్ఘ విరామం తరువాత సందడి చేయడమే కాకుండా.. ఘనవిజయాలు అందుకోవడం వార్తల్లో నిలుస్తోంది. ఆ ఇద్దరు మరెవరో కాదు… పలు చిత్రాల్లో జంటగా మురిపించిన మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ ఇద్దరి రీ-ఎంట్రీ ఫిల్మ్స్ కి సంబంధించి మూడు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే.. చిరు రీ-ఎంట్రీ ఫిల్మ్ `ఖైదీ నంబర్ 150` 2017 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కాగా, విజయశాంతి రీ-ఎంట్రీ మూవీ `సరిలేరు నీకెవ్వరు` 2020 సంక్రాంతి సందర్భంగా అదే జనవరి 11కి జనం ముందుకొచ్చింది. ఇక `ఖైదీ నంబర్ 150`కి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా, ఆర్. రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా పనిచేయగా.. `సరిలేరు నీకెవ్వరు`కి కూడా దేవిశ్రీ ప్రసాద్, ఆర్. రత్నవేలు వర్క్చేశారు. మొత్తమ్మీద.. రీ-ఎంట్రీ విషయంలో ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్ చిరు, విజయశాంతి… మూడు కామన్ ఫ్యాక్టర్స్ తో ఒకే బాటలో ముందుకు సాగారన్నమాట.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: