కొరియన్ ఫిల్మ్ `మిస్ గ్రానీ` ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం `ఓ బేబి` ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి మరో కొరియన్ ఫిల్మ్ ని రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే.. 2017లో విడుదలైన కొరియన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ `మిడ్ నైట్ రన్నర్స్`ని తెలుగులో రీమేక్ చేయడానికి సురేష్ బాబు, సునీత తాటి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కాప్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీస్ రెజీనా, నివేదా థామస్ పోలీస్ పాత్రల్లో కనిపించనున్నారని వినికిడి. `స్వామి రారా` ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే… మాతృకలో ఇద్దరు అబ్బాయిల చుట్టూ సినిమా తిరిగితే.. రీమేక్ లో మాత్రం అమ్మాయిల వెర్షన్ లో కథ సాగనుంది. `మిడ్ నైట్ రన్నర్స్` తెలుగు రీమేక్ కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: