అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదే సినిమాను తమిళంలో ‘నెర్కొండ పార్వాయి’ అనే టైటిల్తో.. అజిత్ ప్రధాన పాత్రలో తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సంగతి కూడా విదితమే. తాజా సమాచారం మేరకు ఈ నెల 20 నుండి సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. పవన్ కూడా త్వరలోనే చిత్రీకరణలో పాల్గొననున్నారట. ఒకపక్క రాజకీయాల్లో కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ ఈ సినిమా కోసం కొద్దిరోజులు మాత్రమే కేటాయించడంతో దర్శక నిర్మాతలు కూడా అందుకు అనుగుణంగా పవన్ తో షూట్ చేయాలని చూస్తున్నారట.
[custom_ad]
ఇదిలా ఉండగా… పింక్ రీమేక్ రచన వ్యవహారం అంతా కూడా త్రివిక్రమ్ చేస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై త్రివిక్రమ్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. అల..వైకుంఠపురములో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన త్రివిక్రమ్ పింక్ రీమేక్ లో తన రోల్ పై క్లారిటీ ఇచ్చాడు. మీడియాలో వస్తున్నట్లుగా పింక్ రీమేక్ కోసం తానేం రచన సహకారం అందించడం లేదని… కేవలం పవన్ కళ్యాణ్ కి ఆ సినిమా చూడమని మాత్రమే సలహా ఇచ్చానని… అంతకు మించి నేను ఆ సినిమా గురించి పట్టించుకోవడం లేదని త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ సినిమా తెలుగులో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: