అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా భారీ అంచనాల మధ్య శనివారం విడుదలైంది. ఇక ముందుగా ఊహించినట్లుగానే తొలిరోజే హిట్ టాక్ నే తెచ్చుకుంది. ఇక తొలి రోజు వసూళ్ల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ దుమ్ముదులిపేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో కలిపి తొలిరోజు ఈ సినిమా 35 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఈసంగతి పక్కన పెడితే సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్లో భాగంగా మహేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పిన సంగతి తెలిసిందే. మహేష్ కు ఉన్న డ్రీం ప్రాజెక్ట్స్ లో రాజమౌళి తో సినిమా చేయడం కూడా ఒకటి అని చెప్పాడు. మరి మహేష్ బాబు- రాజమౌళి.. ఈ కాంబినేషన్ కోసం టాలీవుడ్ మొత్తం ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీ వస్తే రికార్డులు బ్రేక్ అవుతాయని ఎప్పటి నుంచో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు అభిమానులు.
[custom_ad]
మహేష్ తో రాజమౌళి సినిమా అంటే ఆ స్టోరీ ఓ రేంజ్ లో ఉండాలి.. ఈ నేపథ్యంలోనే మహేష్కు సరిపోయే స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నప్పుడే అతడిని కలుస్తాను. ఇందులో అంత తొందరేం లేదు అని ఇటీవలే రాజమౌళి కూడా చెప్పుకొచ్చాడు. మరి ఆ కథ తొందరగా రెడీ అవ్వాలని.. ఈ సూపర్ కాంబినేషన్ లో సినిమా తొందరగా రావాలని కోరుకుందాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: