తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ కూడా ఒకరన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గీతా ఆర్ట్స్ అనే బ్యానర్ ద్వారా ఈయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. సీనియర్ హీరోనా, యంగ్ హీరోనా అనేవి పట్టించుకోకుండా ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేస్తున్నారు. అదే ఆయనను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ను చేసింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా వున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఆయనకు అరుదైన పురస్కారం దక్కింది. సామాజిక అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నందుకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు చాంపియన్స్ ఆఫ్ చేంజ్ పురస్కారాన్ని అందించనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సినీ నిర్మాత అల్లు అరవింద్ ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఈ నెల 20న న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతుల మీదుగా అల్లు అరవింద్ చాంపియన్స్ ఆఫ్ చేంజ్-2019 పురస్కారాన్ని స్వీకరించనున్నారు. అల్లు అరవింద్ తో పాటు నలుగురు సీఎంలు, క్రీడాకారులతో పాటు మరికొందరు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: