ఈ ఏడాది దీపావళి సీజన్ లో విడుదలైన `ఖైదీ`తో అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు కార్తి. అయితే, తాజాగా వచ్చిన `దొంగ`(తమిళంలో `తంబి`) మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. కాగా, ప్రస్తుతం కార్తి `సుల్తాన్`, `పొన్నియన్ సెల్వన్` చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు సెట్స్ పై ఉండగనే… మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఈ టాలెంటెడ్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… పోయినేడాది `అభిమన్యుడు`( తమిళంలో `ఇరుంబు తిరై`)తో అలరించిన దర్శకుడు పి.యస్.మిత్రన్ తో కార్తి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంతేకాదు… రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని… 2020 సెకండాఫ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని వినికిడి. మరి…. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: