ఈ ఏడాది `రాక్షసుడు`తో మెమరబుల్ హిట్ ని అందుకున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ప్రస్తుతం `కందిరీగ` దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడీ టాలెంటెడ్ స్టార్. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ లోపే మరో చిత్రాన్ని పట్టాలెక్కించే దిశగా శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నాడట. వినిపిస్తున్న కథనాల ప్రకారం… ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుందని సమాచారం. అలాగే ఓ నూతన నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుందని వినికిడి. మరి… `బాద్షా` తరువాత సరైన విజయం లేని శ్రీను వైట్లకి… సాయిశ్రీనివాస్ కాంబినేషన్ ఫిల్మ్ అయినా కలిసొస్తుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: