ఆకట్టుకుంటున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్

Sarileru Neekevvaru Anthem Gets Superb Response

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నిన్న ఈ సినిమా ఆంథమ్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈపాట మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పాట రాసింది, పాటను కంపోజ్ చేసింది కూడా దేవిశ్రీనే. ఈ పాటలో ప్రధానంగా సైన్యం, సైనికుల గొప్పతనం, వారి త్యాగాలను గుర్తు చేస్తూ, హత్తుకునే లిరిక్స్ తో నెటిజన్లు ఫిదా చేస్తోంది. ఈ పాట ‘మారణాయుధాలు ఎన్ని ఎదురైనా.. ప్రాణాన్ని ఎదురు పంపేవాడు.. ఒకడే ఒకడు వాడే సైనికుడు..’అంటూ సాగుతూ అదరగొడుతోంది. దేవిశ్రీ మరోసారి తన కంపోజింగ్‌తో అద్భుతం సృష్టించాడు. దీనికి శంకర్‌ మహదేవన్‌ తన గాత్రం పాటకు జీవం పోసింది.

కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − twelve =