యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. `భీష్మ`, `రంగ్ దే`, `చదరంగం` (చంద్రశేఖర్ యేలేటి ఫిల్మ్) పేర్లతో రూపొందుతున్న సదరు మూడు సినిమాలు చిత్రీకరణ తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో… `ఛల్ మోహన్ రంగ` దర్శకుడు కృష్ణ చైతన్యతో కొత్త చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు నితిన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`పవర్ పేట` పేరుతో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా తెరకెక్కుతుందని… రెండు భాగాలకు సెపరేట్ క్లైమాక్స్ లు కూడా ఉంటాయని సమాచారం. అంతేకాదు… ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ `పవర్ పేట`ని నిర్మిస్తుందని వినికిడి. 2020 ఫిబ్రవరిలో `పవర్ పేట` పట్టాలెక్కే అవకాశముంది. మరి… రెండు భాగాలుగా రానున్న ఈ ప్రయోగాత్మక వాణిజ్య చిత్రం నితిన్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: