‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే…మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ వీడియో రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. క్రిస్టమస్ పండుగ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. మరి డేట్ ఎప్పుడో ఇంకా తెలియాల్సి వుంది.
కాగా రష్మికా మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. దీనితో పాటు మరో రెండు సినిమాలు కూడా నితిన్ చేతిలో ఉన్నాయి. చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా చేయనుండగా… తనతో ‘ఛల్ మోహన్ రంగా’ చేసిన కృష్ణచైతన్యతోనే మరో సినిమాను చేయనున్నాడు.
గత కొద్ది కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. పరాజయాలు ఎదురైనా కూడా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ తన దూకుడును కొనసాగిస్తూనే ఉన్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: