మొత్తానికి ఇటు తెలుగు, అటు తమిళ్ తో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీ అయింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ మధ్య కాస్త వెనుక పడినా ఇప్పుడు మాత్రం తన కెరీర్ పై దృష్టి పెట్టి పలు కొత్త ప్రాజెక్టులను లైన్ లో పెట్టింది. ప్రస్తుతం హిందీలో ఆమె చేసిన ‘మర్జవాన్’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాపైనే ఇప్పుడు రకుల్ హోప్స్ అన్నీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తమిళంలో కమల్ సరసన ‘ఇండియన్ 2’తో పాటు శివ కార్తికేయన్ కొత్త చిత్రంలో కూడా రకుల్ నటిస్తోంది. తెలుగు విషయానికొస్తే త్వరలో మొదలుకానున్న నితిన్, చంద్రశేఖర్ యేలేటి సినిమాలో కథానాయకిగా నటించనుంది.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే రకుల్ మరో బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు తెలుస్తుంది. అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ ప్రముఖ ఫిలిం మేకర్ నిఖిల్ అద్వానీ రూపొందిస్తున్న ఈ సినిమాను శశి లాల్ నాయర్ కూతురు కాశ్వీ నాయర్ డైరెక్ట్ చేస్తుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
ఇక వీటితో పాటు మరో రెండు సినిమాలు కూడా లైన్ లో వున్నాయట. వాటి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఏడాది కాస్త డల్ గానే వున్నా.. రకుల్ రానున్న యేడాదిలో ఫుల్ బిజీ కానుంది. మరి మిగిలిన సినిమాలు ఏంటో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: