సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం `దర్బార్` 2020 సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలయ్యేలోపే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించనున్నారు రజినీ. `శౌర్యం` శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. తాజా సమాచారం ప్రకారం… ఈ చిత్రాన్ని రజినీ బర్త్ డే (డిసెంబర్ 12) సందర్భంగా లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిసింది. అంతేకాదు… ఈ సినిమాలో రజినీకి జోడీగా ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ ని ఎంపిక చేశారని కోలీవుడ్ టాక్. రజినీ అల్లుడు, కోలీవుడ్ యూత్ ఐకాన్ ధనుష్ లేటెస్ట్ బ్లాక్బస్టర్ `అసురన్`లో మంజు వారియర్ నటించారు. మరి…. రజినీ అల్లుడి సరసన మురిపించిన మంజు… రజినీ పక్కన కూడా తనదైన ముద్ర వేస్తుందేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: