‘సిసింద్రీ'(1995)గా బుడిబుడి అడుగుల ప్రాయంలోనే ఘన విజయాన్ని అందుకున్న వైనం అక్కినేని అఖిల్ సొంతం. ఆ సినిమా విడుదలైన 20 ఏళ్ల తర్వాత ‘అఖిల్'(2015)తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఆపై ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాలలో సందడి చేసిన అఖిల్… ఇప్పటివరకు ‘సిసింద్రీ’ స్థాయి విజయాన్ని నమోదు చేసుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో… ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పైనే తన ఆశలను పెట్టుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్’ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపి సుందర్ బాణీలు అందిస్తున్నాడు. మరి… ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయినా అఖిల్ కి సాలిడ్ హిట్ అందిస్తుందేమో చూడాలి.
కాగా… ‘అఖిల్ 4’ కి సంబంధించిన తాజా షెడ్యూల్ నేటి నుంచి హైదరాబాద్ లో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: