అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా రూపొందిన సుప్రీమ్ మూవీ ఘనవిజయం సాధించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. వారిద్దరూ జంటగా మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. మహానుభావుడు, భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2, UV క్రియేషన్స్ బ్యానర్స్ పై సాయి ధరమ్, రాశీ జంటగా
పల్లెటూరి నేపథ్యం లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సత్య రాజ్, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్న ప్రతి రోజూ పండగే మూవీ గత కొన్ని నెలలుగా గోదావరి జిల్లాల పరిసరప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. ఆ షూటింగ్ షెడ్యూల్ నిన్నటితో కంప్లీట్ అయింది. డైరెక్టర్ మారుతి, తాను హైదరాబాద్ కు పయనమైన విషయం ట్విట్టర్ ద్వారా హీరో సాయి ధరమ్ అభిమానులతో పంచుకొన్నారు. తన పై రాజమండ్రి ప్రజలు చూపిన ప్రేమ, అభిమానులకు థ్యాంక్స్ అని, హైదరాబాద్ కు వెళుతున్నట్టు సాయి ట్వీట్ చేశారు. ప్రతి రోజూ పండగే మూవీ తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: