5దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమ కు సేవలందిస్తున్న అమితాబ్ బచ్చన్ ను మరో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. 1969 సంవత్సరంలో సాత్ హిందుస్తానీ మూవీ తో బాలీవుడ్ కు పరిచయమైన అమితాబ్5దశాబ్దాలుగా వందలాది చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు. అమితాబ్ నటించిన అనేక మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోట్లాది అభిమానులున్న, బాలీవుడ్ లో తిరుగులేని నటుడిగా వెలుగొందుతున్న అమితాబ్ 4 నేషనల్ అవార్డ్స్ తోపాటు, పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. లెజెండరీ నటుడు అమితాబ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కు ఎంపికైనందుకు పలువురు సినీ ప్రముఖులుశుభాకాంక్షలు తెలిపారు.శుభాకాంక్షలు తెలిపిన వారిలో రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, మోహన్ లాల్, పవన్ కళ్యాణ్, కరణ్ జోహార్, ఆశా భోంస్లే ,ఇతర సెలబ్రిటీస్ ఉన్నారు.దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న అమితాబ్ ను వారు అభినందించారు. మొట్ట మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ సైరా నరసింహా రెడ్డిమూవీ లో ఒక ప్రత్యేక పాత్రలో అమితాబ్ నటించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: