సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్మీ మేజర్గా దర్శనమివ్వనున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్కి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. లేడీ సూపర్స్టార్ విజయశాంతి శక్తిమంతమైన పాత్ర పోషిస్తుండగా… రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన తాజా షెడ్యూల్ మంగళవారంతో పూర్తయ్యింది. ఇందులో భాగంగా… రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్లో మహేష్, కొంతమంది ఫైటర్లపై పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. కాగా… తదుపరి దశ చిత్రీకరణను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో… టెంపుల్ బ్యాక్ గ్రౌండ్లో వచ్చే ఎపిసోడ్స్ను షూట్ చేయనున్నారని సమాచారం.
రామబ్రహ్మం సుంకర, `దిల్` రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న `సరిలేరు నీకెవ్వరు`కు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. 2020 సంక్రాంతికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: