ఇటీవలే మన్మథుడు సీక్వెల్ మన్మథుడు2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఆ సినిమాతో అంతలా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇక సినిమా విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేయడానికి రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే మరో కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ‘మన్మథుడు 2’ సినిమా తరువాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా చేయాలి. అయితే ఈసినిమాలో నాగ్ తో పాటు చైతూ కూడా నటించనున్నాడు. కానీ.. చైతు ప్రస్తుతం వెంకీమామ, మరో పక్క శేఖర్ కమ్ముల సినిమా.. ఇలా వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. దీనితో చైతూ కమిట్ మెంట్స్ పూర్తయ్యేలోగా నాగ్ మరో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట.
దీనిలో భాగంగానే ‘మహర్షి’ సినిమా స్క్రిప్ట్ విభాగంలో పనిచేసిన సాల్మన్ ఇటీవల నాగ్ కి ఒక కథ వినిపించాడట. ఈ కథ నాగ్ కి బాగా నచ్చేయడంతో, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఈ సినిమా ద్వారా సాల్మన్ ను దర్శకుడిగాపరిచయం చేయనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుందని సమాచారం. మరి ఈ వార్తలు నిజమేనా..? ఇందులో ఎంత నిజముంది..? దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: