మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమా పనుల్లో బిజీ గా వున్నాడు. షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. మరో వైపు ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇక ఈ సినిమాను ఆక్టోబర్ 8 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈసినిమాలో హీరోయిన్ ముందు అనుష్క, కాజల్ పేర్లు వినిపించగా.. ఇప్పుడు తాజాగా మరో పేరు వినిపిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న ఇలియానా. ఇలియానాను కొరటాల సినిమాలో కథానాయికగా ఎంపికచేసుకోవాలని చిత్రబృందం నిర్ణయించుకుందట. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్లో జోరుగా ప్రచారంలో ఉంది.
2012 సినిమాలో దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత టాలీవుడ్ కి దూరమైంది ఇల్లీ బేబీ. ఆ తర్వాత మళ్ళీ రవితేజ తో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా అనుకున్నంత విజయం దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు చిరు తో జోడీ కట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. మరి చూద్దాం గోవా బ్యూటీ కి ఈ సినిమాలో నటించే అవకాశం దక్కుతుందో? లేదో?.
మరోపక్క ఇలియానా హిందీలో పాగల్పంతి సినిమాతో బిజీగా ఉన్నారు. అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం, అర్షద్ వార్సి, కృతి కర్బంద, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: