`యన్టీఆర్` బయోపిక్ తరువాత స్వల్ప విరామం తీసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ… ప్రస్తుతం `జై సింహా` దర్శకుడు కె.యస్.రవికుమార్ కాంబినేషన్లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ థాయ్లాండ్లో జరుగుతోంది. కాగా… ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే తేదికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట.
ఆ వివరాల్లోకి వెళితే… డిసెంబర్ 21 బాలయ్య పెద్ద కుమార్తె బ్రహ్మణి పుట్టినరోజు. అలాగే అదే రోజున వేర్వేరు సంవత్సరాల్లో `పట్టాభిషేకం`(1985), `లారీ డ్రైవర్`(1990) చిత్రాలు విడుదలై మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో… బాలయ్య తన 105వ చిత్రాన్ని కూడా అదే తేదికి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి… సెంటిమెంట్ కొనసాగి బాలయ్య ఖాతాలో మరో బ్లాక్బస్టర్ చేరుతుందేమో చూడాలి. ఏదేమైనా… ఈ విడుదల తేదిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.