`ఆర్య`, `ఆర్య 2` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న కథానాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని… హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ ప్రధానాంశంగా సాగే ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్గా కనిపించనున్నట్టు సమాచారం. అంతేకాదు… ఇందులో కొత్త తరహా ప్రేమ కథను కూడా సుకుమార్ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్టు టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రాన్ని… ఈ ఏడాది దసరాకు ప్రారంభించనున్నారని సమాచారం. అలాగే… నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ కెరీర్లో 20వ చిత్రంగా రూపొందనున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో ఈ క్రేజీ ఎంటర్టైనర్పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం… బన్నీ, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=lTEXo8m87LM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: