`చిత్రలహరి` విజయం సాయితేజ్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో…యూత్ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు తేజ్. `ప్రతీ రోజు పండగే` పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయితేజ్ కి జోడీగా రాశీ ఖన్నా నటిస్తోంది. `సుప్రీమ్` తరువాత వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. కాగా… ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2020 సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం. ఆసక్తికరమైన విషయమేమిటంటే… సాయితేజ్కి ఇదే తొలి సంక్రాంతి సినిమా. అంతేకాదు… ఈ తరం మెగా కాంపౌండ్ హీరోల తొలి `సంక్రాంతి` సినిమాలన్నీ విజయం సాధించిన వైనం కూడా సాయితేజ్కి కలిసొచ్చే అంశమనే చెప్పాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`సుస్వాగతం`తో పవన్ కళ్యాణ్, `దేశముదురు`తో అల్లు అర్జున్, `నాయక్`తో రామ్ చరణ్, `ఎఫ్ 2`తో వరుణ్ తేజ్… తొలిసారిగా సంక్రాంతి బరిలోకి దిగి విజయాలు అందుకున్నారు. వారి బాటలోనే సాయితేజ్ కూడా వెళ్ళి… `ప్రతీ రోజు పండగే`తో తొలి సంక్రాంతి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
[youtube_video videoid=UNQYmBKcjHs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: