కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నగేష్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయంకానున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు ఓ ఎగ్జైటింగ్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు నాలుగు రోజుల క్రితం చిత్రయూనిట్ తెలిపిన సంగతి తెలిసిందే కదా. తాజాగా అదేంటో రివీల్ చేశారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు సమర్పిస్తున్నట్టు తెలిపారు. దానితో పాటు సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
We are super proud to announce “@SVC_official” Dil Raju Garu will be presenting our maiden production.
starring @KeerthyOfficial @AadhiOfficial, Directed By @nkukunoor. produced by @sudheerbza, Co-Produced by @shravyavarma. A @ThisIsDSP Musical.
Title and First Look Soon.✌ pic.twitter.com/owLMDV5SDD
— Worth A Shot (@WorthAShotArts) July 15, 2019
కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ సహనిర్మాతగా వ్యవహరించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేయనున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
[subscribe]
[youtube_video videoid=oXxprpiYyP4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: