విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. కేవలం హీరోగానే కాదు.. మంచి రైటర్ గా కూడా అడివి శేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా తాను ఏ సినిమాలు చేస్తున్నాడో అన్న విషయంపై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు అడివి శేష్. ఎవరు, మేజర్, గూఢచారి సినిమాలు చేస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్ హిరోగా ఎవరు అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా షూట్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా ప్రీ లుక్ ను కూడా ఇటీవలే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మరి టీజర్ చూస్తే కానీ ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయం చెప్పలేం. అంతేకాదు..ఆగష్టు 23న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. శేష్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
దీనితో పాటు సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు జీ మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ (జీఎంబీ) సంయుక్తంగా.. 26/11ముంబై అటాక్ నేపథ్యంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వీర జవాన్ సందీప్ ఉన్ని కృష్ణన్ కథను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే కదా. మేజర్ అనే టైటిల్ తో తెరకెక్కునున్న ఈ సినిమాలో సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో గత ఏడాది గూఢచారి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అడివి శేష్ నటిస్తున్నాడు. గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
ఇక ఈ రెండు సినిమాలతో గూఢచారి సీక్వెల్ ను కూడా లైన్ లో పెట్టాడు అడివి శేష్. ఆగష్ట్ లో ఎవరు సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరో వైపు మేజర్ షూట్ చేస్తున్నారు. ఇవి చేస్తూనే గూఢచారి 2 సినిమాలు పట్టాలెక్కించనున్నాడు. మొత్తానికి మూడు సినిమాలతో వస్తున్న శేష్ కు ఈ మూడు సినిమాలు ఎంత వరకూ సక్సెస్ అందిస్తాయో చూద్దాం..
🙂 అది విషయం
— Adivi Sesh (@AdiviSesh) July 10, 2019
[youtube_video videoid=CQ_7dQbA-HY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: