`గీత గోవిందం`… యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కెరీర్లోనే హయ్యస్ట్ గ్రాసర్గా నిలచిన చిత్రం. అలాంటి ఈ సినిమాలో కథానాయికగా నటించిన రష్మిక మందన్నతో… ప్రస్తుతం `డియర్ కామ్రేడ్` చేస్తున్నాడు విజయ్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్… ఈ నెల 26న విడుదల కానుంది. కాగా,`గీత గోవిందం` నాయికతో మరోసారి కలసి పనిచేసిన విజయ్… ఆ చిత్ర దర్శకుడు పరశురామ్తోనూ మరో చిత్రం చేయబోతున్నాడంటూ ప్రచారం సాగుతోంది. అంతేకాదు… ఇప్పటికే విజయ్, పరశురామ్ మధ్య చర్చలు జరిగాయని… అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరలోగానీ లేదంటే వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో గానీ ఈ కాంబినేషన్ మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే `హీరో` అనే మల్టీలింగ్వల్ ఫిల్మ్లో కూడా నటిస్తున్నాడు. ఆ చిత్రాలు విడుదలయ్యేలోపు పరశురామ్ కాంబినేషన్ మూవీ పట్టాలెక్కే అవకాశముందంటున్నారు. చూద్దాం… ఏం జరుగుతుందో?
[youtube_video videoid=llV-auefhRs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: