ఇన్ని రోజులు పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన శృతిహాసన్.. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తరువాత మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. మళ్లీ సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో అప్పుడే రవితేజతో నటించే అవకాశం కొట్టేసింది. మొదట రెమ్యునరేషన్ దగ్గర కాస్త మొండికేసిన ఈ భామ ఆ తరువాత దిగొచ్చి.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక తమిళ్ లో విజయ్ సేతుపతితో కూడా మరో సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే జరుపుకొని షూటింగ్ ను ప్రారంభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు శృతిహాసన్ కు మరో బంపరాఫర్ వచ్చినట్టు సమాచారం. హాలీవుడ్ లో ఓ టివీ సిరీస్ లో నటించే అవకాశం శృతీకి దక్కినట్టు తెలుస్తోంది. హాలీవుడ్లో ‘బోర్న్’ సిరీస్లో 5 చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రాల తరహాలోనే ‘ట్రెడ్ స్టోన్’ అనే సిరీస్ను రూపొందిస్తున్నారు. మైఖేల్ ఫోర్బ్స్, మైఖేల్ గ్యాస్టన్, బ్రైన్ జె. స్మిత్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఇంటర్నేషనల్ స్పై మిషన్ కథాంశంగా రూపొందనున్న ఈ సిరీస్లో శ్రుతీహాసన్ ఢిల్లీకి చెందిన నీరా పటేల్ పాత్రలో కనిపిస్తుందట. పగలంతా హోటల్లో వెయిట్రెస్గా కనిపించి రాత్రి హత్యలు చేసే కిల్లర్గా మారే పాత్రలో శృతీ నటించనుందట. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్లో శ్రుతీహాసన్ పాల్గొననుందట. అయితే యూఎస్ టీవీ సిరీస్లో నటించనున్న ఫస్ట్ సౌతిండియన్ హీరోయిన్ కూడా శ్రుతీహాసనే కావడం విశేషం. మరి ఈ సిరీస్ తో శృతిహాసన్ కూడా గ్లోబల్ స్టార్ గా గుర్తింపుతెచ్చుకుంటుంది.
[youtube_video videoid=r_VEHCaZkoE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: