2014 లో నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ అనే సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య వీరిద్దరి కాంబినేషన్ కార్తికేయ సినిమా సీక్వెల్ కార్తికేయ2 తెరకెక్కించనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇన్ని రోజులు ఇవి వార్తలు గానే ఉన్నాయి తప్పా.. ఈ విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు తాజాగా ఈ కాంబినేషన్ ల్ మూవీ పై క్లారిటీ ఇచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. చందూ మొండేటి దర్శకత్వంలో, నిఖిల్ హీరోగా… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల, టీడీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో నటించే తదితర నటులు, సాంకేతిక నిపుణుల గురించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామని కూడా తెలిపారు. అయితే సినిమా టైటిల్ మాత్రం ప్రకటించలేదు. కార్తికేయ2 అన్న టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. మరి ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారో? లేదా ఇంకేదైనా టైటిల్ ను ఖరారు చేస్తారో? చూడాలి.
[subscribe]
[youtube_video videoid=Yla-qyklOGM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: