మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేడు ఎండలు దంచికొడుతున్నాయి. ఇక ఈ ఎండల్లో భయటకి వెళ్లాలన్నా భయపడిపోతున్నారు ప్రజలు. అలాంటి ఎండలను సైతం లెక్క చేయకుండా.. షూటింగ్ లు చేసుకుంటూ చెమటోడుస్తున్నారు మన టాలీవుడ్ హీరోస్. నిజానికి మే నెలలో అయితే, సినిమా షూటింగ్ లకి సెలవు పెట్టి, ఫ్యామిలీతో హాయిగా సమ్మర్ ట్రిప్ లకు వెళ్లి ఎంజాయ్ చేయడం మన హీరోలకు అలవాటే. అయితే, ఈసారి మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. ముందే అనుకున్న కమిట్ మెంట్ ల వల్ల సమ్మర్ ట్రిప్ లకు బ్రేక్ చెప్పి.. మండుటెండలను సైతం ఖాతరు చేయకుండా షూటింగ్ లు చేసుకుంటున్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం..
సైరా
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడం… దానికి తోడు తాజాగా ఈ సినిమా కోసం వేసిన సెట్
ఇటీవలే అగ్ని ప్రమాదానికి గురవ్వడం జరిగింది. దీంతో చిరు కూడా ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా.. షూటింగ్ లో పాల్గొంటున్నారు. జూన్ కల్లా ఈ సినిమా షూటింగ్ అయిపోవాలి. ఆ తరువాత నిర్మాణాంతర కార్యక్రమాలు స్టార్ట్ చేసి అక్టోబర్ కల్లా అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. అలా అవ్వాలంటే షూటింగ్ నిర్విరామంగా జరగాల్సిందే. ఈ నేపథ్యంలో చిరుకు సమ్మర్ హాలీడేస్ లేకుండాపోయాయి.
మన్మథుడు 2
నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మన్మథుడు సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘మన్మథుడు 2’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దీంతో కింగ్ నాగార్జున సమ్మర్ హాలీడే ట్రిప్ కు బ్రేక్ పడింది. వీలున్నప్పుడల్లా ఫ్యామిలీతో ట్రిప్పులు వేయడానికి ప్రాధాన్యమిచ్చే నాగార్జున…ఈసారి రూటు మార్చి షూటింగ్ కే ప్రాధాన్యమిచ్చారు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్ తో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తైపోతుందట.. అందుకే షూటింగ్ లో పాల్గొంటున్నారట నాగ్.
వెంకీమామ
విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమాలో నటిస్తున్న వెంకీ, చైతు కూడా ఎలాంటి సమ్మర్ బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మామ అల్లుళ్లు ఇద్దరూ భానుడి భగభగలను సైతం ఖాతరు చేయకుండా షూటింగ్ లో పాల్గొంటూ.. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి రెడీ అవుతున్నారు.
సాహో
సుజీత్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం షూటింగ్ చివరి దశ పనుల్లో ఉంది. ఆగష్టు 15వ తేదీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అందువల్ల, ఈ సినిమా పనులు ఎంతో వేగవంతంగా సాగుతున్నాయి. రెండు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రభాస్ కి కూడా సమ్మర్ హాలీడే ట్రిప్ కు బ్రేక్ పడింది.
ఆర్ఆర్ఆర్
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని 2020లో రిలీజ్ చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేశారు. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా షూటింగ్ కు ఎన్టీఆర్, రామ్ చరణ్ కు గాయాలవ్వడంతో బ్రేక్ పడింది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఇద్దరూ హీరోలు షూటింగ్ లో ఫుల్ బిజీతో ఉన్నారు. దాంతో, ఈ హీరోలకు కూడా ఈ వేసవికి సెలవులు దొరకలేదు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా ఎండలను సైతం పక్కనపెట్టి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఒక సినిమా చేస్తున్నప్పుడే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోన్న ఈ సమయంలో ప్రతి హీరో కూడా తమ తమ సినిమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే, సెలవులకు కూడా నో చెప్పి మరీ కష్టపడుతున్నారు.
[subscribe]
[youtube_video videoid=jP7HSdPuJdc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: