బాలీవుడ్ లో స్కిల్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ సినిమాతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు విద్యాబాలన్. ఇక టాలీవుడ్ లో నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు.. ఎన్టీఆర్ మహానాయకుడు. ఇక ఈ బయోపిక్ ద్వారా టాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను పోషించారు విద్యాబాలన్ ఈసినిమాలో. ఆ పాత్రలో ఆమె తన నటనతో అందరినీ మెప్పించారు. తాను మాత్రమే ఆ పాత్ర చేయగలదన్నట్టు జీవించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో బయోపిక్ లో ఆమె నటించనున్నట్టు తెలుస్తోంది. గణితశాస్త్ర మేథావి.. హ్యూమన్ కంప్యూటర్గా పేరు తెచ్చుకున్న శకుంతలా దేవి పాత్రలో విద్యాబాలన్ నటించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్లో అధికారికంగా ప్రకటించారు. అను మీనన్ దర్శకత్వంలో, విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ బయోపిక్ తో విద్యా బాలన్ ఎన్ని అవార్డులు సొంతం చేసుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=SVe_MFEHYOQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: