2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే 2017 లో కోలీవుడ్లో ‘సింగం 3’, టాలీవుడ్లో ‘కాటమరాయుడు’, బాలీవుడ్లో ‘బెహెన్ హోగీ తెరి’ సినిమాల్లో సందడి చేసిన ఆమె ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. ఈ గ్యాప్ లో బుల్లితెరపై కూడా మెరిసింది ఈ భామ. అయితే ఇప్పుడు తాజాగా మరో ప్రాజెక్ట్ ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న లాభం అనే సినిమాలో శృతిహాసన్ నటించనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను శ్రుతి హాసన్ తన ట్విటర్ ద్వారా పోస్ట్ చేసి ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ‘ఎగ్జైట్మెంట్ న్యూ ప్రాజెక్టును ఇవాళ ప్రారంభించా.. నాకు ఎంతో ఇష్టమైన సహ నటుడు విజయ్ సేతతితో కలిసి పనిచేస్తుండటం సంతోషంగా ఉంది. చిత్ర బృందం ఎంతో నచ్చింది. చాలా పాజిటివ్గా, సరదాగా ఉన్నారు’ అని ట్వీట్ లో పేర్కొంది. మరి దాదాపు రెండేళ్ల తరువాత వస్తున్న శృతి హాసన్ ఈ సినిమా మంచి హిట్టవ్వాలని కోరుకుందాం.
[subscribe]
[youtube_video videoid=RvvFGz46rKw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: