వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం మహర్షి. మే 9న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ను సాధించి రికార్డ్ సాధించింది. ఇక ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిలో భాగంగానే పూజా హెగ్డే, హీరో మహేష్పై చిత్రీకరించిన ‘ఎవరెస్ట్ అంచున’ డ్యూయెట్ సాంగ్ వీడియో ప్రివ్యూ ను నిన్న రిలీజ్ చేయగా.. ఈ పాట కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఈరోజు లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. చిన్మయి శ్రీపాద, డీఎస్పీ ఈ గీతాన్ని ఆలపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా జగపతి బాబు, రావు రమేశ్ ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, అల్లరి నరేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.
[subscribe]
[youtube_video videoid=Uvj_bnAv_w4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: