మెగా కాంపౌండ్ నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒకటిన్నర దశాబ్దం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన శంకర్దాదా ఎంబీబీఎస్
సినిమాలో… శ్రీరామచంద్ర మూర్తిగా కీలక పాత్రలో కనిపించిన మాస్టర్ వైష్ణవ్ తేజ్(సాయి తేజ్ తమ్ముడు)… ఇప్పుడు మిస్టర్ వైష్ణవ్ తేజ్గా ఎదిగి కథానాయకుడిగా తొలి అడుగులు వేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీకి… బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా… ఈ సినిమా కోసం తొలుత మనీషా రాజ్ ను కథానాయికగా ఎంచుకున్న చిత్ర బృందం… ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలో మరో నాయికని ఎంపిక చేసే దిశగా అడుగులు వేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం… కేరళకుట్టి దేవికా సంజయ్కి ఈ క్రేజీ ప్రాజెక్ట్లో హీరోయిన్గా నటించే ఛాన్స్ దక్కిందని టాలీవుడ్ టాక్. గత ఏడాది విడుదలైన న్యాన్ ప్రకాశన్
అనే మలయాళ చిత్రంతో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది దేవిక. త్వరలోనే దేవిక ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ పేరు నిర్ణయించని చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది.
[subscribe]
[youtube_video videoid=EUftNjOVwR8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: