‘శివపుత్రుడు’… 2004లో కాసుల వర్షం కురిపించిన తమిళ అనువాద చిత్రం. ఆ సినిమాతోనే… కోలీవుడ్ స్టార్స్ విక్రమ్, సూర్య తెలుగునాట మంచి మార్కెట్ని సంపాదించుకున్నారు. కట్ చేస్తే… ఆ సినిమాలో స్నేహితులుగా నటించిన ఈ ఇద్దరు టాలెంటెడ్ హీరోలు… ఇప్పుడు తమ అప్కమింగ్ మూవీస్తో పోటీ పడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… సూర్య నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎన్జీకే
మే 31న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే రోజున విక్రమ్ నటించిన కొత్త చిత్రం కడారమ్ కొండేన్
రిలీజ్ కానున్నట్లు సమాచారం. ‘కాలాపానీ’, ‘చీకటి రాజ్యం’ వంటి సినిమాలను తెరకెక్కించిన రాజేష్ సెల్వ ఈ చిత్రానికి దర్శకుడు కావడం… లోక నాయకుడు కమల్ హాసన్ సమర్పిస్తుండడంతో కడారమ్ కొండేన్
పై మంచి అంచనాలే ఉన్నాయి.
అయితే… విక్రమ్, సూర్య బాక్సాఫీస్ బరిలో దిగడం ఇదే తొలిసారి కాదు. శివపుత్రుడు
కి ముందు, తరువాత కూడా అలాంటి సందర్భాలు ఉన్నాయి. 2001లో దీపావళి కానుకగా ఒకే రోజున (నవంబర్ 14న) విక్రమ్ నటించిన ‘కాశి’, సూర్య హీరోగా నటించిన ‘నంద’ విడుదలయ్యాయి. అలా… తొలిసారి పోటీకి దిగిన సందర్భంలో ఈ ఇద్దరు హీరోలకు ఆయా చిత్రాలు మంచి పేరును తీసుకువచ్చాయి. అనంతరం… దాదాపు 17 ఏళ్ళ గ్యాప్ తర్వాత 2018 సంక్రాంతి కానుకగా ఒకే రోజున (జనవరి 12న) విడుదలైన ‘స్కెచ్’తో విక్రమ్, ‘గ్యాంగ్’(తమిళంలో ‘తానా సేరంద కూట్టం’)తో సూర్య మరోసారి తలపడ్డారు. అయితే ఆ సందర్భంలో వీరిద్దరికీ మిశ్రమ ఫలితాలే దక్కాయి.
ఈ నేపథ్యంలో… ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగుతున్న వైనం ఈ వెర్సటైల్ ఆర్టిస్ట్లకు ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=RfTNwFP6GeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: