సూపర్ స్టార్ రజినీకాంత్, బ్రిలియంట్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో రజినీ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ‘చంద్రముఖి’, ‘శివాజీ’ (ప్రత్యేక గీతం), ‘కథానాయకుడు’ తరువాత ప్రముఖ కథానాయిక నయనతార ఇందులో రజినీ కి జోడీగా నటిస్తోంది.
ఇదిలా ఉంటే… ఏప్రిల్ 10 నుంచి షూటింగ్ కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి తాజాగా ‘దర్బార్’ అనే టైటిల్ ని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. అలాగే… ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
ముంబై నేపథ్యంలో సాగే ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా…. సంతోష్ శివన్ ఛాయాగ్రహణ బాధ్యతలను, అనిరుథ్ బాణీలను అందిస్తున్నారు.
కాగా… 2020 పొంగల్ కానుకగా ‘దర్బార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=6ub9sHJALIk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: